గోదావరికి మళ్లీ వరద

గోదావరిలో నీటి మట్టం పెరుగుతోంది. దీంతో దేవీపట్నం మండలం పరిధిలోని గ్రామాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. ధవలేశ్వరం బ్యారేజ్ నుంచి 5 లక్షల 11 వేల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదల చేస్తున్నారు.

Update: 2019-08-16 05:23 GMT

వరద గోదావరి మళ్ళీ ఉధృతంగా ప్రవహిస్తోంది. రాజమండ్రి ధవలేశ్వరం బ్యారేజ్ లో 175 గేట్లు పూర్తిగా ఎత్తివుంచారు. ఎగువ భద్రాచలం నుంచి వస్తున్న 6 లక్షలకుపైగా క్యూసెక్కుల వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదలవుతోంది.వచ్చింది వచ్చినట్టే సముద్రంలోకి వదిలేయడం వల్ల ధవలేశ్వరం వద్ద నీటిమట్టం 8.2 అడుగులుగా వుంది, భద్రాచలం వద్ద 41 అడుగులకు చేరుకున్న వరద నిలకడగానే కొనసాగడంతో పోలవరం కాఫర్ డ్యాం ఎగువ బ్యాక్ వాటర్ష పెరిగి మళ్ళీ దేవీపట్నం ముంపు గ్రామాల్లోకి వరద నీరు చేరుతుంది.

Tags:    

Similar News