మేడిగడ్డ వద్ద హోమంలో పాల్గొన్న సీఎం కేసీఆర్

Update: 2019-06-21 04:29 GMT

కాళేశ్వం ప్రాజెక్టు ప్రారంభోత్సవంలో భాగంగా సీఎం కేసీఆర్ మొదట మేడిగడ్డకు చేరుకున్నారు. మేడిగడ్డ దగ్గర యాగశాలలో నిర్వహించిన జలసంకల్ప యాగంలో సీఎం కేసీఆర్ దంపతులు పాల్గొన్నారు. సీఎం కేసీఆర్ జ్యోతిప్రజ్వలన చేసి హోమాన్ని ప్రారంభించారు. ఇక్కడ శృంగేరి పీఠం అర్చకుల ఆధ్వర్యంలో జలసంకల్ప మహోత్సవ యాగం నిర్వహిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం 10.30 గంటలకు పలువురు ముఖ్యనేతల సమక్షంలో నీటిని విడుదల చేయనున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇవాళ ఉదయం 10.30 గంటల సమయంలో గవర్నర్, ఇరుగుపొరుగు రాష్ర్టాల ముఖ్యమంత్రుల సమక్షంలో నీటిని విడుదల చేయనున్నారు. ఈ చారిత్రాత్మక సన్నివేశంలో యావత్ తెలంగాణ ప్రజానీకం సంబురంగా పాలుపంచుకుంటున్నది. 

Tags:    

Similar News