టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ కేవలం క్రికెట్లోనే కాకుండా సోషల్ మీడియాలో కూడా కోహ్లీ రికార్డుల పరంపర కొనసాగుతోంది. సామాజిక మాధ్యమాల్లో ఎంతో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు విరాట్ కోహ్లీ. సోషల్ మీడియాలోని ప్రతి ప్లాట్ఫాం(ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్)లో 30 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్న ఏకైక క్రికెటర్గా విరాట్ గుర్తింపు పొందాడు. విరాట్ కోహ్లీ తర్వాత స్థానంలో సచిన్ టెండూల్కర్ ఉండగా, ఈ ఇద్దరి తర్వాత మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని మూడో స్థానంలో ఉన్నాడు.