వికెట్ పడ్డా కుదురుకున్న శ్రీలంక

Update: 2019-06-28 10:05 GMT

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు శ్రీలంక, దక్షిణాఫ్రికా జట్ల మధ్య మ్యాచ్ జరగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న సౌతాఫ్రికా శ్రీలంకను ఆదిలోనే దెబ్బతీసింది. ఇన్నింగ్స్ మొదటి బంతికే శ్రీలంక కెప్టెన్ కరుణరత్నే(0) రబాడ బౌలింగ్ లో ఫా డు ప్లెసిస్‌ చేతికి చిక్కాడు. అయితే, తరువాత వచ్చిన ఫెర్నాండోతో కలసి కుశాల్‌ పెరీరా శ్రీలంక ఇన్నింగ్స్ ను గాడిలో పెట్టాడు. త్వరగా వికెట్ పడినా ఆ ప్రభావం కనిపించ నీయకుండా పరుగులు సాధిస్తున్నారు. శ్రీలంక బ్యాట్స్ మెన్. ఆరు ఓవర్లు ముగిసేసరికి శ్రీలంక జట్టు ఒక్క వికెట్ నష్టానికి 37 పరుగులు చేసింది. పెరీరా 13 పరుగులతోనూ, ఫెర్నాండో 17 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News