ప్రపంచకప్లో భాగంగా లీడ్స్ వేదికగా ఇంగ్లాండ్తో జరుగుతున్న మ్యాచ్లో శ్రీలంక తడబడింది. టాస్ గెలిచి మొదట బ్యాటింగ్కు దిగిన లంక నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 232 పరుగులు మాత్రమే చేయగలిగింది. సీనియర్ బ్యాట్స్మన్ ఏంజెలో మాథ్యూస్(85నాటౌట్: 115 బంతులో 5ఫోర్లు, సిక్స్) ఒంటరి పోరాటం చేయడంతో శ్రీలంక గౌరవప్రదమైన స్కోరు చేయగలిగింది. అవిష్క ఫెర్నాండో(49: 39 బంతుల్లో 6ఫోర్లు, సిక్సర్లు), కుశాల్ మెండీస్(46: 68 బంతుల్లో 2ఫోర్లు) రాణించడంతో నిర్ణీత ఓవర్లలో 9 వికెట్లకు 232 పరుగులు చేసింది. జోఫ్రా ఆర్చర్(3/52), మార్క్వుడ్(3/40), అదిల్ రషీద్(2/45) విజృంభించడతో లంక టపటపా వికెట్లు కోల్పోయింది.