రెండో వికెట్ కోల్పోయిన ఇండియా.. రోహిత్ ఔట్!

Update: 2019-06-16 12:14 GMT

పాకిస్థాన్ తో జరుగుతున్నవరల్డ్ కప్ మ్యాచ్ లో టీమిండియా తన రెండో వికెట్ కోల్పోయింది. భారీ స్కోరుకు పరుగులు తీసే క్రమంలో రోహిత్ శర్మ 140 పరుగుల వద్ద ఔటయ్యాడు. హాసన్ ఆఫ్ సైడ్ వేసిన బంతిని ఆడబోయిన రోహిత్ షార్ట్ ఫిన్ లెగ్ లో రియాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ జట్టు 41 ఓవర్లకు రెండు వికెట్ల నష్టానికి 254 పరుగులు చేసింది. కోహ్లీ 45 పరుగుల్తోనూ, పాండ్య 9 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News