సెంచరీ చేసి పెవిలియన్ కు రోహిత్..కష్టాల్లో భారత్!

Update: 2019-06-30 16:19 GMT

హిట్ మ్యాన్ మళ్ళీ విజృంభించాడు. తనదైన శైలిలో భారత్ ఇన్నింగ్స్ ని నిలబెడుతున్నాడు. నిదానంగా మొదలెట్టే.. నిరుద్యగా చెలరేగిపోయే రోహిత్ మరో సెంచరీ సాధించాడు. 106 బంతుల్లో క్లిష్ట సమయంలో సెంచరీ సాధించడమే కాకుండా.. రిషబ్ పంత్ తో కలిసి అర్థ సెంచరీ భాగస్వామ్యాన్ని నిలబెట్టాడు. ఇంకా చేయాల్సిన పరుగులు చాలానే ఉన్నా.. రోహిత్ గత ప్రదర్శనల రికార్డులను బట్టి చూస్తే టీమిండియా విజయానికి ఇంకా దారులు మూసుకుపోలేదనిపించింది. కానీ.. వోక్స్ మరోసారి ఇండియాకి చుక్కలు చూపించాడు. 37 వ ఓవర్ తొలి బంతితోనే కీలకమైన రోహిత్ శ్రమను అవుట్ చేశాడు. దీనితో టీమిండియా విజయం దాదాపుగా కష్టంగానే మారిపోయింది. 37 ఓవర్లలో204 పరుగులు చేసిన భారత జట్టు గెలవాలంటే ఇంకా 134  పరుగులు చేయాలి.. ఏడు వికెట్లు చేతిలో ఉన్నాయి.  

Tags:    

Similar News