సూపర స్టార్ మహేష్ బాబుకు క్రికెట్ అంటే పిచ్చి అభిమానం. అయితే, ఇప్పటివరకూ ఎక్కడా క్రికెట్ మ్యాచ్ లు చూడటానికి వెళ్లినట్టు తెలియలేదు. ఇపుడు కొడుకు గౌతమ్ కోసం ఈ టాలీవుడ్ అగ్రహీరో మైదానానికి రాక తప్పలేదు. ప్రస్తుతం కుటుంబంతో ఫారెన్ టూర్లో ఉన్న మహేష్ బాబు ఆదివారం జరుగుతున్న మ్యాచ్ తన కుమారుడు గౌతమ్ తో కలిసి ప్రత్యక్షమయ్యాడు.
ఇద్దరూ కలిసి కూలింగ్ గ్లాసెస్ పెట్టుకుని మ్యాచ్ ను హాయిగా ఆస్వాదిస్తూ ఓ సెల్ఫీ కూడా తీసుకున్నారు. మా అబ్బాయి కోసం భారత్-ఆస్ట్రేలియా మ్యాచ్ కు వచ్చానంటూ మహేశ్ తన సెల్ఫీకి క్యాప్షన్ పెట్టాడు. దీన్ని మహేశ్ బాబు తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్టు చేయగా, అభిమానుల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.
This one's for my boy...🏏 ♥♥ #INDvAUS @ The Oval pic.twitter.com/35MgIm1nwc
— Mahesh Babu (@urstrulyMahesh) June 9, 2019