టీమిండియా బ్యాట్స్ మెన్ పోరాడుతున్నారు. ఓపెనర్ రాహుల్ త్వరగా ఔటవ్వడంతో ఆచి తూచి ఆడుతూ భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలో దిగిన టీమిండియా నిదానంగా ఆడుతూ వస్తోంది. ఈ క్రమంలో రోహిత్ శర్మ తో కలిసి కోహ్లీ ఇన్నింగ్స్ రిపేరు మొదలు పెట్టాడు. 61 బంతుల్లో 52 పరుగులు చేసి తన అర్థ సెంచరీ సాధించాడు. ఈ టోర్నీలో కోహ్లీ కి ఇది వరుసగా ఐదో అర్థ శతకం కావడం విశేషం. మరో పక్క రోహిత్ శర్మ నిలకడగా ఆడుతూ తన అర్థ శతకాన్ని దగ్గరగా వచ్చాడు. 61 బంతుల్లో 47 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 22 ఓవర్లు పూర్తయ్యే టప్పటికి టీమిండియా స్కోరు ఒక్క వికెట్ నష్టానికి 100 పరుగులు.