ప్రపంచ కప్ తర్వాత భారత్ , వెస్టిండిస్ జట్టుతో ఆడేందుకు సిద్దం అవుతుంది . దానికి గాను ఈ రోజు ఎమేస్కే ప్రసాద్ నేతృత్వంలోని సెలెక్షన్ కమిటి జట్టును ఎంపీక చేయనుంది . నిజానికి ఈ సెలక్షన్ శుక్రవారం జరగాల్సి ఉండగా ఈ రోజుకు వాయిదా పడింది .అయితే ఇందులో ఎవరేవరికి చోటు దక్కనుంది అన్నది ఆసక్తి నెలకొంది .
రెండు నెలల పాటు టీంకి దూరంగా ఉంటానని ఇండియన్ మాజీ కెప్టెన్ మరియు వికెట్ కీపర్ ధోని చెప్పడంతో ధోని ప్లేస్ లో రిషబ్ పంత్ కి మూడు ఫార్మాట్లోను చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి . అతనికి బ్యాకప్ కీపర్ గా టెస్టుల్లో వ్రుద్దిమన్ సహా , వన్డే ఫార్మాట్లో దినేష్ కార్తీక్ ని ఎంపీక చేసే అవకాశం ఉంది .
ఇక బౌలింగ్ విషయానికి వచ్చేసరికి బుమ్రా, షమి, భువనేశ్వర్, హార్దిక్ పాండ్యాలకు విశ్రాంతిని ఇచ్చి రిజర్వ్ లో ఉన్న ఆటగాళ్ళకు అవకాశం ఇవ్వాలని చూస్తున్నట్లు తెలుస్తుంది . నవ్దీప్ సైనీ, ఖలీల్ అహ్మద్, దీపక్ చాహర్ కి ఛాన్స్ దక్కేలా ఉంది . ఇక టెస్ట్ సీరిస్ లో భాగంగా సీనియర్ ఆటగాళ్ళకు చోటు దక్కే అవకాశం ఉంది .చటేశ్వర్ పుజారా, అజింక్య రహానె, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజాలను జట్టులోకి తీసుకునే అవకాశం లేకపోలేదు ..