మూడు వన్డేల సిరీస్లో భాగంగా ఆస్ట్రేలియాతో మెల్బోర్న్లో ఇవాళ ఫైనల్ మ్యాచ్ జరుగుతోంది .నిర్ణయాత్మక ఆఖరి వన్డేలో టీమిండియా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వర్షం కారణంగా మ్యాచ్ ప్రారంభం ఆలస్యం అయింది. మహ్మద్ సిరాజ్ను తప్పించి టీమిండియా ఆల్రౌండర్ విజయ్ శంకర్ కు చోటు కల్పించారు. రాయుడు స్థానంలో కేదార్ జాదవ్, కుల్దీప్ స్థానంలో చాహల్ జట్టులోకి వచ్చారు. ఇప్పటికే ముగిసిన రెండు వన్డేల్లో చెరో విజయాన్ని సొంతం చేసుకున్నాయి ఇరుజట్లు. దీంతో ఈ మ్యాచ్ రెండు జట్లకు కీలకంగా మారింది. టి20 సిరీస్ను 1-1తో ముగించి, టెస్ట్ సరీస్లో 2-1తో విజయం సాధించి చరిత్ర సృష్టించిన టీమిండియా.. ఈ మ్యాచ్లో నెగ్గి వన్డే సిరీస్ను సైతం చేజిక్కించుకోవాలనిచూస్తుంది.
తుది జట్లు:
ఆస్ట్రేలియా: క్యారీ, ఫించ్ (కెప్టెన్), ఖాజా, షాన్ మార్ష్, హ్యాండ్స్కోంబ్, స్టొయినిస్, మ్యాక్స్వెల్, జంపా, స్టాన్లేక్, సిడిల్, రిచర్డ్సన్
భారత్: రోహిత్, ధావన్, కోహ్లి (కెప్టెన్), జాదవ్, ధోని, దినేశ్ కార్తీక్, విజయ్ శంకర్, జడేజా, చహల్, భువనేశ్వర్, షమీ.