టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్న భారత్

Update: 2019-02-06 03:38 GMT

ఓటమి కారణంగా చేదు జ్ఞాపకంగా మిగిలిన టీ20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ తర్వాత... భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారిగా పొట్టి ఫార్మాట్‌ బరిలో దిగుతోంది. న్యూజిలాండ్‌ మహిళలతో జరుగుతున్న తొలి టీ20లో భారత మహిళలు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు. కివీస్ క్రీడాకారిణులు 11 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 81 పరుగులు చేశారు.

ఇప్పటికే 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళా జట్టు.. టీ20 సిరీస్‌ను కూడా గెలుచుకుని పర్యటనను విజయవంతంగా ముగించాలని భావిస్తున్నారు.

కాగా ఇదే వేదికపై మహిళల మ్యాచ్‌ అనంతరం భారత్, న్యూజిలాండ్‌ పురుషుల టీ20 మ్యాచ్‌ను నిర్వహిస్తారు. ఈ మ్యాచ్ లో తెలుగు క్రీడాకారిణి అరుంధతి రెడ్డికి కూడా తుది జట్టులో అవకాశం దక్కింది.​ 

Similar News