వానా వానా వల్లప్ప ..టీమిండియా విజయం ఖాయం అయిపోయింది .అయితే, భారీ తేడాతో గెలవడానికి మాత్రం వరుణుడే కారణం.
విజయానికి అవసరమైన 337 పరుగులు చేయడానికి బ్యాటింగ్ ప్రారంభించిన పాక్ కొద్దిసేపు పోరాడింది. 5 నుంచి 27 ఓవర్ల వరకూ రెండో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. తరువాత నాలుగు ఓవర్లలో నాలుగు వికెట్లను సమర్పించుకున్నారు పాక్ బ్యాట్స్మెన్. విజయ లక్ష్యం చాలా దూరంలో ఉంది. ఈదశలో వర్షం పాక్ పాలిట శాపం గా మారింది.
వర్షం వల్ల ఆట ఆగిపోయింది .అపుడు పాక్ స్కోరు 166/6.తిరిగి ఆట ప్రారంభం అయినపుడు 4౦ ఓవర్లకు మ్యాచ్ కుదించారు. దీంతో పాకిస్తాన్ 5ఓవర్లకు 135 పరుగులు చేయాల్సి వచ్చింది .
ఇక భారత్ విజయం లాంఛనంగా మారిపోయింది