విజయానికి దగ్గర్లో భారత్‌..ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతున్న జడేజా, ధోని

Update: 2019-07-10 13:39 GMT

జడేజా-ధోనిల సూపర్‌ ఇన్నింగ్స్‌తో టీమిండియా విజయంపై ఆశలు చిగురించాయి. వీరిద్దరూ ఏడో వికెట్‌కు ఇప్పటికే 78 పరుగుల విలువైన భాగాస్వామ్యాన్ని నమోదు చేశారు. జడేజా అద్భుతం చేస్తున్నాడు. ఫోర్లు, సిక్సర్లతో భారత శిబిరంలో ఆశలు రేకెత్తిస్తున్నాడు. ధోనీ అండగా చెలరేగుతూ న్యూజిలాండ్ బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. 46 ఓవర్లకు భారత్‌ 198/6. బౌల్ట్‌ 10 పరుగులు ఇచ్చాడు. జడేజా (74) చక్కని బౌండరీ బాదాడు. ధోనీ (35) అతడికి తోడుగా ఉన్నాడు. టీమిండియా విజయానికి 42 పరుగులు కావాలి. 

Tags:    

Similar News