మొదటి వికెట్ కోల్పోయిన భారత్

Update: 2019-06-27 09:57 GMT

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు టీమిండియా వెస్టిండీస్ టీం తో తలపడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ కు శుభారంభం దక్కలేదు. ఐదు ఒవర్లవరకూ నిదానంగా సాగిన భారత్ బ్యాటింగ్ కు ఆరో ఓవర్ లో షాక్ తగిలింది. రోచ్ వేసిన ఈ ఓవర్ చివరి బంతికి ఓపెనర్ రోహిత్ శర్మ హోప్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో ఏడు ఓవర్లు ముగిసేసరికి టీమిండియా ఒక్క వికెట్ నష్టపోయి 35 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 11 పరుగులతోనూ, కోహ్లీ 4 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News