New Zealand vs India, 2nd Test Day 3 : ఓటమి దిశగా భారత్

Update: 2020-03-02 02:25 GMT
New Zealand vs India, 2nd Test Day 3 (File Photo)

క్రైస్ట్‌చర్చ్‌ వేదికగా భారత్, న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ లో భారత జట్టు ఓటమి దిశగా పయనిస్తుంది. 90/6తో మూడో రోజు ఆటను ప్రారంభించిన టీమ్‌ఇండియా మరో 34 పరుగులు చేసి ఆలౌట్ అయింది. భారత బాట్స్ మెన్స్ హనుమ విహారి(9), రిషభ్‌ పంత్‌(4), మహ్మద్‌ షమి(5), జస్ప్రీత్‌ బుమ్రా(4) వెంటవెంటనే వెనుదిరిగారు. జట్టులో జడేజా(16) ఒక్కడే నాటౌట్‌ గా నిలిచాడు. దీనితో కివీస్‌ ముందు భారత్ 132 పరుగుల లక్ష్యాన్ని మాత్రమే ఉంచగలిగింది. ఇక తిరిగి రెండో ఇన్నింగ్స్ ని ప్రారంభించిన కివీస్ జట్టు ప్రస్తుతం 30 ఓవర్లకి గాను ఓక వికెట్ కోల్పోయి 108 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజ్ లో విలియమ్సన్ (1) , టామ్‌బ్లండెల్‌(47) పరుగులతో ఉన్నారు. అంతకుముందు టామ్‌ లాథమ్ 52 (74) పరుగులు చేసి అవుట్ అయ్యాడు.  

Tags:    

Similar News