టీమిండియాకు ఆదిలోనే ఎదురుదెబ్బ

Update: 2019-02-22 03:59 GMT

ఆస్ట్రేలియాతో స్వదేశంలో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌కు ముందే భారత్ కు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆసీస్‌తో సిరీస్‌కు ఆల్‌ రౌండర్‌ హార్దిక్‌ పాండ్యా దూరమయ్యాడు. హార్దిక్‌కు వెన‍్నునొప్పి కారణంగా సిరీస్‌ మొత్తానికి దూరమవుతున్నట్లు బీసీసీఐ ఓ ప్రకటనలో తెలిపింది. పాండ్యా స్థానంలో రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు ఎవర్నీ ప్రకటించలేదు.. కానీ వన్డే సిరీస్‌కు మాత్రం రవీంద్ర జడేజాను ఎంపిక చేశారు.

కాగా వరల్డ్‌కప్‌కు ముందు జరుగుతున్న ఈ కీలక సిరీస్‌ నుంచి పాండ్యా వైదొలగడం టీమిండియాకు టెన్షన్ వాతావరణాన్ని కలిగిస్తోంది. గత సెప్టెంబర్‌లో ఆసియాకప్‌లో పాకిస్తాన్‌ మ్యాచ్‌ తర్వాత వెన్నునొప్పి కారణంగా ఆ టోర్నీకి మొత్తం దూరమైన హార్దిక్‌ మరోమారు అదే వెన్నునొప్పి కారణంగా ఈ సిరీస్ నుంచి అర్ధాంతరంగా వైదొలగాల్సి వచ్చింది. 

Similar News