ఓపెనర్లను కోల్పోయిన ఇంగ్లాండ్

Update: 2019-06-03 14:38 GMT

వరల్డ్ కప్ లో భాగంగా పాకిస్తాన్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంగ్లాండ్ లక్ష్యఛేదన ప్రారంభించింది. అయితే, పది ఓవర్లకే ఓపెనర్లిద్దర్నీ కోల్పోయింది. మొదట ఓవర్ లో ఇంగ్లాండ్‌ లక్ష్య ఛేదనను దూకుడుగా ఆరంభించింది. జేసన్‌ రాయ్‌(8) రెండు బౌండరీలు బాది జోరు చూపించాడు. అయితే, మూడో ఓవర్ లోనే రాయ్ అవుటయిపోయాడు. దీంతో ఇంగ్లాండ్ వేగం తగ్గింది. రెండో ఓపెనర్ బెయిర్‌ స్టో, రూట్ తో కలిసి ఇన్నింగ్స్ చక్కదిద్దే పనిలో పడ్డాడు. 9ఓవర్‌ చివరి బంతికి సర్పరాజ్‌కి క్యాచ్‌ ఇచ్చి బెయిర్‌స్టో(32; 31బంతుల్లో ) పెవిలియన్‌కు చేరుకున్నాడు.  ఇంగ్లాండ్ పది ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 62 పరుగులు చేసింది. రూట్‌(20), మోర్గాన్‌(1) బ్యాటింగ్ చేస్తున్నారు.  



Tags:    

Similar News