శ్రీలంకపై ఆసీస్ విజయం..

Update: 2019-10-27 12:00 GMT

అడిలైడ్ ఓవెల్ వేదికగా శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఆసిస్ బాట్స్ మెన్ డేవిడ్ వార్నర్ రెచ్చిపోయాడు. శ్రీలంక బౌలర్లకి చుక్కలు చూపించాడు. సెంచరితో కదం తొక్కి ఆ జట్టుకు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్ లో మొదటగా టాస్ గెలిచిన శ్రీలంక ఫీల్డింగ్ ఎంచుకుంది. అసీస్ ఓపెనర్స్ ఫించ్, వార్నర్‌ల ఆసీస్ జట్టుకు శుభారంభాన్ని అందించారు. మొదటి వికెట్‌కి వీరిద్దరూ కలిసి 122 పరుగులు జోడించారు. ఆ తర్వాత ఫించ్ అవుట్ కాగా మ్యాక్స్‌వెల్ కూడా శ్రీలంక బౌలర్లకు చుక్కలు చూపించాడు. వార్నర్ సెంచరీతో పాటు ఫించ్, మ్యాక్స్‌వెల్ చెరో అర్థ శతకాలు సాధించడంతో ఆస్ట్రేలియా 20 ఓవర్లలో 233 పరుగులు చేసింది... ఆ తర్వాత బ్యాటింగ్ కి దిగిన శ్రీలంక బ్యాట్స్ మెన్స్ ఆసీస్ బౌలర్ల ధాటికి నిలదొక్కుకోలేకపోయారు.. 20 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి.. శ్రీలంక 99 పరుగులు మాత్రమే చేసారు. దీనితో ఆసీస్ 134 పరుగుల తేడాతో విజయం సాధించింది... ఈరోజు 33వ పుట్టినరోజు జరుపుకుంటున్న వార్నర్‌కి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించడం విశేషం..

Tags:    

Similar News