జస్ ప్రీత్ బుమ్రా స్థానంలో సిరాజ్ కు చోటు

ఆస్ట్రేలియాతో ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కింది. టీమిండియా తురుపుముక్క జస్ ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా సిరాజ్ కు అవకాశం కల్పించారు.

Update: 2019-01-10 03:18 GMT
Mohammed Siraj

ఆస్ట్రేలియాతో ఈనెల 12 నుంచి ప్రారంభమయ్యే తీన్మార్ వన్డే సిరీస్ లో పాల్గొనే భారత జట్టులో హైదరాబాద్ యువఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు చోటు దక్కింది. టీమిండియా తురుపుముక్క జస్ ప్రీత్ బుమ్రాకు విశ్రాంతి ఇవ్వడం ద్వారా సిరాజ్ కు అవకాశం కల్పించారు. టీమిండియా తరపున ఇప్పటి వరకూ మూడు టీ-20 మ్యాచ్ ల్లో ఆడిన 24 ఏళ్ల సిరాజ్ తొలిసారిగా వన్డే జట్టులో చోటు సంపాదించాడు. ఫాస్ట్, బౌన్సీ వికెట్లకు మరోపేరైన ఆస్ట్రేలియా గడ్డపై ఆడాలన్న తన కల ఇప్పటికి నెరవేరిందని తుదిజట్టులో ఆడే అవకాశం వస్తే పూర్తిస్థాయిలో రాణించడానికి సిద్ధమని ప్రకటించాడు. సిరీస్ లోని తొలివన్డే సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్ వేదికగా శనివారం ఉదయం 7 గంటలకు ప్రారంభంకానుంది.

Similar News