నిలకడగా ఆడుతున్నారు కానీ..

Update: 2019-06-08 14:40 GMT

వరల్డ్ కప్ లో టోర్నీలో భాగంగా ఇంగ్లాండ్ ఇచ్చిన భారీ లక్ష్యం 387 పరుగులను ఛేదించే క్రమంలో ఆదిలోనే వికెట్ కోల్పోయింది బాంగ్లాదేశ్. ఓపెనర్ నాలుగో ఓవర్‌ రెండో బంతికి సౌమ్య సర్కార్‌(2; 8బంతుల్లో) ఆర్చర్‌ బౌలింగ్‌లో క్లీన్‌బౌల్డ్‌గా వెనుదిరిగాడు. తరువాత క్రీజులోకి వచ్చిన షకిబ్‌ ఉల్‌ హసన్‌, మరో ఓపెనర్ ఇక్బల్ తో  కల్సి నిదానంగా బ్యాటింగ్ చేస్తున్నాడు. పది ఓవర్లు ముగిసే సరిగి బాంగ్లాదేశ్ జట్టు ఒక వికెట్ నష్టానికి 48 పరుగులు చేసింది. ఇక్బల్ 16 పరుగులతోనూ, హాసన్ 26 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. 

Tags:    

Similar News