అందర్నీ ఆడించాయి..

Update: 2019-06-28 16:05 GMT

వరల్డ్ కప్ టోర్నీలో భాగంగా ఈరోజు శ్రీలంక, దక్షిణాఫ్రికా మధ్య మ్యాచ్ జరుగుతోంది. అయితే, ఈ మ్యాచ్ లో శ్రీలంక మొదట బ్యాటింగ్ చేసింది. శ్రీలంక బ్యాటింగ్ చేస్తున్న సమయంలో ఇన్నింగ్స్ 48 ఓవర్‌లో చోటు చేసుకున్న ఓ ఘటనతో మైదానంలో ఉన్నవారంతా పడుకోవాల్సి వచ్చింది. అందర్నీ కాసేపు బెంబేలెత్తించింది ఏమిటో తెలుసా. తేనెటీగలు.. క్రిస్‌ మోరిస్‌ బౌలింగ్‌ చేస్తుండగా.. ఐదో బంతి వేశాక ఒక్కసారిగా మైదానంలోకి తేనెటీగలు గుంపులుగా వచ్చాయి. దీంతో ఆటగాళ్లతో సహా.. అంపైర్లు కూడా వాటి నుంచి తప్పించుకోవడానికి కింద పడుకున్నారు. కాసేపటికే అంతా సర్దుకోవడంతో వెంటనే మ్యాచ్‌ కొనసాగింది.

ఇదిలా ఉండగా దక్షిణాఫ్రికా-శ్రీలంక జట్లు మైదానంలో తలపడుతుండగా ఇలా తేనెటీగలు మ్యాచ్‌కు అంతరాయం కలిగిచడం ఇది రెండోసారి. 2017లో ఇరు జట్లు మధ్య వన్డే మ్యాచ్‌ సందర్భంగా తేనెటీగలు మైదానంలో వచ్చి ఆటకు చాలాసేపు అంతరాయం కలిగించాయి. విచిత్రమేమిటంటే అప్పుడు కూడా శ్రీలంకనే బ్యాటింగ్‌ చేస్తుండగా ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ రెండు ఫొటోలను కలిపి క్రికెట్ వరల్డ్‌కప్‌ తాజాగా ట్విటర్‌లో పోస్ట్ చేసింది.  




Tags:    

Similar News