గత ఏడాది సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రెబల్ స్టార్ ప్రభాస్.. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులకు ఆశించిన ఫలితాన్ని మాత్రం ఇవ్వలేదు. కలెక్షన్ల పరంగా మాత్రం సినిమా బాగానే రాబట్టింది. ప్రస్తుతం ప్రభాస్ జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు .. ఈ సినిమాకి జాన్ అనే టైటిల్ ని ఖరారు చేసినట్టు సమాచారం. ఇక దీనిపైన దర్శక నిర్మాతలు స్పందించాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇదే పేరుకు దగ్గరగా శర్వానంద్ , సమంత జాను సినిమా వస్తుండడంతో సినిమా పేరును మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. పీరియాడిక్ రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతుంది. సాహో సినిమాని నిర్మించిన యువీ క్రియేషన్స్ వారే ఈ సినిమాని కూడా నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజా హేగ్దే నటిస్తుంది. తాజాగా సినిమాకి సంబందించిన మరో షెడ్యుల్ కూడా మొదలైంది. అయితే ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్ ని ప్రేక్షకులకి ఇచ్చేందుకు చిత్రయూనిట్ రెడీ అయింది. సంక్రాంతి పండగ సినిమా సందర్బంగా శుక్రవారం (17-01-2020) ఈ ప్రభాస్ కొత్త సినిమాకు సంబంధించిన ఓ అప్డేట్ ఇవ్వనున్నారు. దీనిపైన చిత్రయూనిట్ అధికారిక ప్రకటన విడుదల చేసింది. అయితే ఇప్పుడు ఆ అప్డేట్ ఏంటన్న చర్చ మొదలైంది. ఈ అప్డేట్ కోసం ఇటు ప్రభాస్ ఫ్యాన్స్ నుంచి సాధారణ ప్రేక్షకులు కూడా ఆసక్తికరంగా చూస్తున్నారు.
కే రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్నఈ సినిమా తర్వాత ప్రభాస్ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయనున్నాడని తెలుస్తుంది. ఇప్పటికే వీరి మధ్య కథ చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. కానీ దీనిపైన అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది. ఇక త్రివిక్రమ్ తెరకెక్కించిన తాజా చిత్రం అల వైకుంఠపురములో చిత్రం విడుదలై మంచి టాక్ ని సంపాదించుకుంది. ఇందులో అల్లు అర్జున్ , పూజా హేగ్దే హీరో హీరోయిన్లుగా నటించారు.