రాశి, రంభపై సీరియస్ అయిన కోర్టు...

Update: 2019-09-29 09:08 GMT

ఒకప్పుడు వెండితెరపై అందం, అభినయంతో ఆకట్టుకున్న హీరోయిన్స్ రంభ, రాశి... ప్రస్తుతం సినిమాలు చేయడం ఆపేసి బుల్లితెరపై కనిపిస్తున్నారు.. ఇవే కాకుండా వాణిజ్య ప్రకటనలు చేస్తున్నారు. ఈ నేపధ్యంలో వారు కలర్స్ అనే వాణిజ్య ప్రకటన చేసారు. ఇందులో బరువు తగ్గడం ఈజీ అనే చెప్పే ప్రకటన.. అయితే దీనిపైన విజయవాడ కోర్టు సీరియస్ అయ్యింది.

కలర్స్ వెయిట్ లాస్ ప్రకటన చూసి మోసపోయానని విజయవాడకి చెందిన ఓ వ్యక్తి స్థానిక కన్జూమర్ కోర్టులో కేసు వేశాడు. ఈ కేసును పరిశీలించిన కోర్టు కలర్స్ వెయిట్ లాస్ కి జరిమానా విధిస్తూ కస్టమర్ పే చేసిన డబ్బులకు గాను 9 శాతం వడ్డీని కలిపి ఇవ్వాలని చెప్పుకొచ్చింది. అలాగే వినియోగదారుల సంక్షేమ నిధికి రూ.2 లక్షలను జరిమానాగా చెల్లించాలని తీర్పునిచ్చారు. అంతేకాకుండా రాశి, రంభ నటించిన యాడ్స్ పై నిషేధం విధించింది. ఇలాంటి ప్రకటనల్లో నటించే ముందు ఆలోచించుకోవాలని తారలకు హెచ్చరించింది కోర్టు .

Tags:    

Similar News