దర్జాగా కుర్చీలో కూర్చొని.. విజయశాంతి ఫస్ట్ లుక్ రిలీజ్..

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నికెవ్వరు.

Update: 2019-10-26 04:34 GMT

అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేశ్ బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం సరిలేరు నికెవ్వరు.. ఇందులో మహేష్ కి జోడిగా రష్మీక మందన్నా నటిస్తుంది.. ఈ సినిమాతో అలనాటి తార లేడి అమితాబ్ విజయశాంతి రీ ఎంట్రీ ఇస్తుంది. దీపావళి సందర్భంగా సినిమాలోని ఆమె లుక్ ని రిలీజ్ చేసింది చిత్ర బృందం.

దర్శకుడు అనిల్ రావిపూడి ఆమె లుక్ ని ట్విట్టర్ వేదికగా రిలీజ్ చేస్తూ... లేడి అమితాబ్ విజయశాంతి ఫస్ట్ లుక్ అంటూ పోస్ట్ చేసారు.. దర్జాగా కుర్చీలో కూర్చొని చాలా హుందాగా కనిపిస్తుంది విజయశాంతి.. ఈ సినిమాలో ఆమె భారతి అనే పాత్రలో కనిపిస్తుంది. ముప్పై ఏళ్ల కింద విజయశాంతి ఎలా ఉన్నారో ఇప్పటికి అలాగే కనిపిస్తున్నారు. ఈ సినిమాలో ఆమె పాత్ర హైలెట్ కానుందని చిత్ర యూనిట్ చెప్పుకొస్తుంది. దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది..




  


Tags:    

Similar News