47 సినిమాలు .. కృష్ణతో విజయనిర్మల సినీప్రయాణం ..

Update: 2019-06-27 02:04 GMT

నటి మరియు దర్శకురాలు విజయనిర్మల (73) కన్నుమూశారు .. గత కొద్ది రోజుల నుండి అనారోగ్యంతో భాదపడుతున్న ఆమె తుదిశ్వాస విడిచారు .. ఆమె సినీ పరిశ్రమలో కేవలం నటిగానే కాకుండా దర్శకురాలిగా కూడా చెరగని ముద్ర వేసారు .. దర్శకురాలిగా అనేకమైన విభాగాల పైన మంచి పట్టు సాధించారు .. అయితే ఆమె భర్త సూపర్ స్టార్ కృష్ణతో కలిసి దాదాపుగా 47 సినిమాల్లో నటించారు .. వీరిద్దరూ మొదటగా సాక్షి అనే సినిమాలో నటించారు . కృష్ణకు ఈ సినిమా మొదటి సినిమా కావడం విశేషం ..

ఆ తర్వాత మోసగాళ్లకు మోసగాడు, భలే మోసగాడు, పండంటి కాపురం, ప్రజా నాయకుడు, మంచివాళ్లకు మంచివాడు, దేవుడు చేసిన మనుషులు, మీనా, అల్లూరి సీతారామరాజు, దేవదాసు, పాడిపంటలు, రామరాజ్యంలో రక్త పాతం, మూడు పువ్వులు ఆరు కాయలు, హేమాహేమీలు, అంతం కాదిది ఆరంభం, రక్తసంబంధం, సాహసమే నా ఊపిరి, ప్రజల మనిషి, బొబ్బిలి దొర చిత్రాల్లో కలిసి నటించారు. ఇందులో ఎక్కువగా ఆమె దర్శకత్వం వహించిన సినిమాలే కావడం విశేషం .. కృష్ణ పక్కన అత్యదిక సినిమాల్లో హీరోయిన్ గా నటించిన హీరోయిన్ కూడా విజయనిర్మల కావడం మరో విశేషం ..

ఇలా సినిమాల్లో జంటగా కనిపించిన వీరు నిజజీవితంలో కూడా జంట అయ్యారు . కృష్ణ - విజయనిర్మల తిరుపతిలో వివాహం చేసుకున్నారు .. అప్పటినుండి కృష్ణని విజయనిర్మల కంటికిరెప్పలా చూసుకున్నారు .. ఎక్కడికి వెళ్ళినా ఇద్దరు వెళ్ళేవారు .. విజయనిర్మల మరణం పట్ల సినీ ప్రముఖులు సంతాపం ప్రకటించారు ..  

Tags:    

Similar News