స్నేహం కోసం లాక్ డౌన్ లోనూ రిస్క్ చేసి హీరో సహాయం!

Update: 2020-04-04 04:31 GMT
representational image

తమిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి లాక్‌డౌన్‌ను బ్రేక్ చేశారు. లాక్‌డౌన్ బ్రేక్ చేసినా తాను రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోను హీరో అని నిరూపించుకున్నాడు. తమిళనాడుకు చెందిన సీనియర్‌ పాత్రికేయుడు, రచయిత నెల్లాయ్‌ భారతి కన్నుమూశారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన శుక్రవారం ఉదయం చెన్నైలో తుదిశ్వాస విడిచారు.

దీంతో పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. అంత్యక్రియల కోసం భారతి భౌతికకాయాన్ని పోరూర్‌లోని ఇంటికి తరలించారు. లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉండటంతో అతి తక్కువ‌మంది కుటుంబ సభ్యులు, స్నేహితులు హాజరై వీడ్కోలు పలికారు. భార‌తి అత్యంత స‌న్నిహితుడు కావ‌డంతో తమిళ స్టార్ హీరో విజ‌య్ సేతుప‌తి సైతం అంత్య‌క్రియ‌ల్లో పాల్గొన్నాడు. కుటుంబానికి ఆర్థిక‌సాయం చేయడంతో పాటు అంత్య‌క్రియ‌ల ఖ‌ర్చును కూడా ఆయ‌నే భ‌రించారు. లాక్‌డౌన్ ఉన్నా కూడా స‌న్నిహితుడి క‌డ చూపు కోసం వ‌చ్చిన విజ‌య్ సేతుప‌తిని ప‌లువురు అభినందిస్తున్నారు.




 




Tags:    

Similar News