ప్రముఖ బాలీవుడ్ నటి మృతి
ప్రముఖ బాలీవుడ్ నటి నవాబ్ బానూ(నిమ్మి) గుండెపోటుతో మృతి చెందారు.
ప్రముఖ బాలీవుడ్ నటి నవాబ్ బానూ(నిమ్మి) గుండెపోటుతో మృతి చెందారు.గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమెకి నిన్న(బుధవారం) అర్ధరాత్రి ఆకస్మాత్తుగా గుండెపోటు రావడంతో ఆమె తన నివాసం అయిన ముంబైలో కన్నుమూశారు. 1949లో రాజ్ కపూర్ దర్శకత్వం వహించిన బర్సాత్ సినిమాతో నిమ్మీ సినిమా ఇండస్ట్రీలో అడుగుపెట్టారు.
ఆ తర్వాత 1950, 1960 దశకాలలో పలు చిత్రాల్లో నటించి మంచి నటిగా గుర్తింపు తెచ్చుకుంది. రాజ్ కపూర్, దేవ్ ఆనంద్, దిలీప్ కుమార్ వంటి స్టార్స్ తో కలిసి నటించారు. ఇక ఆమె రైటర్ అలీ రాజాని వివాహం చేసుకున్నారు. అయన 2007లో కన్నుమూశారు. ఆమె మరణం పట్ల బాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.