మెగా హీరో వరుణ్ తేజ్ నటించిన 'వాల్మీకి' చిత్రం భారీ అంచనాల నడుపు రేపు (సెప్టెంబర్ 20) ప్రేక్షకుల ముందుకు రానుంది. గబ్బర్ సింగ్ దర్శకుడు హరీష్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంపై తొలి నుండి అనేక వివాదాలు నడుస్తున్నాయి. ముఖ్యంగా ఈ టైటిల్ను మార్చాలని వాల్మీకి తమ కులానికి చెందిన వ్యక్తి అని ఆ పాత్రను నెగిటివ్ చూపించడంపై బోయ కులస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా అనంతపురం, కర్నూలు జిల్లాల్లో వాల్మీకి సినిమా విడుదలకు బ్రేక్ పడింది. శాంతి భద్రతల దృష్ట్యా సినిమా విడుదలను నిలిపివేయాలంటూ అనంతపురం జిల్లా కలెక్టర్ సత్యనారాయణ గురువారం ఆదేశాలు జారీ చేశారు. ఆదేశాలను ధిక్కరించే థియేటర్ యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హెచ్చరించారు. మరోవైపు కర్నూలు జిల్లాలో సినిమా విడుదలను నిలిపివేయాలని కలెక్టర్ వీరపాండియన్ ఆదేశాలు జారీ చేశారు.