పంజాబీ నటుడు మన్మీత్ గైవాల్ ఆత్మహత్య!
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. సినిమా ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఉపాధి కోల్పోయారు.
కరోనా వైరస్ ప్రభావం అన్ని రంగాలపైన పడింది. సినిమా ఇండస్ట్రీ విషయానికి వచ్చేసరికి చాలా మంది ఉపాధి కోల్పోయారు. షూటింగ్లు ఆగిపోవడంతో వాళ్ళ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. దీంతో టీవీ సీరియల్స్లో నటించే వాళ్లు, అందులో పనిచేసే వివిధ విభాగాల సిబ్బందికి ఆర్థిక కష్టాలు తప్పడం లేదు.
ఈ నేపధ్యంలో పంజాబీ నటుడు మన్మీత్ గైవాల్ (29) ఆర్ధిక ఇబ్బందులను తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నాడు. కరోనా వలన షూటింగ్ లు అగోపోవడంతో ఆర్థిక ఇబ్బందులు రావడంతో మానసిక ఒత్తిళ్లకు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. 29 ఏళ్ల మన్మీత్ నవీ ముంబైలో నివసించారు. ఆదత్ సే మజ్బూర్, కుల్దీపాక్ వంటి సీరియల్స్ లో నటించాడు. అంతేకాకుండా పలు టెలివిజన్ కార్యక్రమాలతో పాటు, వాణిజ్య ప్రకటనలలో కూడా కనిపించాడు. మన్మీత్ గైవాల్ కి భార్య ఉన్నారు. ప్రస్తుతం పొలుసులు దీనిపైన కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.