వెన్న తీసిన చరణ్, గారెలు వేసిన మోహన్ బాబు
లాక్ డౌన్ కారణంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు.
లాక్ డౌన్ కారణంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితం అయ్యారు. ఇక సెలబ్రిటీలు కూడా అన్ని పక్కనపెట్టి తమ ఇంట్లోనే ఉంటూ కరోనాపై అవగాహన కలిపిస్తూ ఇంట్లో వాళ్ళతో సమయం గడుపుతున్నారు. తాజాగా రామ్ చరణ్ తన తల్లి సురేఖ, నాన్నమ్మ అంజనా దేవితో కలిసి పెరుగు నుంచి వెన్న తీయడం నేర్చుకున్నారు. ఇక పవన్ కల్యాణ్-రేణూ దేశాయ్ల కుమార్తె ఆద్య తన యాక్టింగ్ స్కిల్స్ చూపించింది. కలెక్షన్ కింగ్ మోహన్ బాబు గారెలు చేశారు. అయన తనయుడు మంచు విష్ణు ఫైట్ మాస్టర్స్తో కలిసి రూపొందించిన ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. అభిమానులు ఈ వీడియోను షేర్ చేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు.