లాక్ డౌన్ వలన చాలా ఆకలితో అలమటిస్తున్నారు. అలాంటివారిని ఆదుకోవడానికి చాలా మంది ముందుకు వచ్చి తమ గొప్ప మనసును చాటుకుంటున్నారు. అందులో భాగంగా అత్తారింటికి దారేది మూవీ ఫేం ప్రణీత ఆకలితో పేద ప్రజల ఆకలి తీరుస్తోంది. తానే సొంత ఖర్చుతో, స్వయంగా వంట చేసి మరి చాలా మంది ఆకలి తీరుస్తుంది. లాక్డౌన్ మొదలైన తరవాత 21 రోజుల్లోనే ఆమె 75 వేల ఆహార పొట్లాలను అందజేసింది.
ముఖానికి మాస్కు ధరించి ప్రణీత వంట చేస్తూ, ప్యాకింగ్ చేస్తున్న ఫొటోలను సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దీనితో అభిమానులు ఆమెను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. అందంతో పాటు అందమైన మనసును అని కామెంట్స్ పెడుతున్నారు. ఇక ప్రణీత ఇప్పటికే టాలీవుడ్ లో పేద కార్మికుల కోసం ఏర్పాటు చేసిన కరోనా క్రైసెస్ ఛారిటీకి ముందుగా లక్ష రూపాయలను ఇచ్చి మిగతా హీరోయిన్స్ కి ఇన్స్పైర్ గా నిలిచింది.