కరోనా మహమ్మారి గురించి జాగ్రత్తలు చెబుతూ సంగీత దర్శకుడు కోటి ఓ పాటను కంపోజ్ చేశారు. శ్రీనివాస్ మౌళి సాహిత్యం అందించిన ఈ పాటను స్వయంగా కోటినే పాడారు. ఈ సాంగ్లో హీరోలు చిరంజీవి, నాగార్జున, వరుణ్ తేజ్, సాయితేజ్ కూడా గొంతు కలుపుతూ నటించారు. అదీ కూడా ఇంటి వద్ద నుంచే వారు ఈ పాటలో భాగస్వామ్యం కావడం విశేషం. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
కరోనా కట్టడికి మెగాస్టార్ చిరంజీవి ఆధ్వర్యంలో సి. సి. సి. (కరోనా క్రైసిస్ చారిటీ మనకోసం) అనే సంస్థను ఏర్పాటు చేశారు. షూటింగ్లు లేక ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం ఏర్పాటు చేసిన 'కరోనా క్రైసిస్ చారిటీ'కి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి.