కౌశల్ పెద్దగా పేరుకి పరచయం అక్కరలేదు .. బిగ్ బాస్ అనే రియాలిటీ షో ద్వారా ఫేమస్ అయ్యాడు . అ సీజన్ లో షో విన్నర్ అవ్వడంతో కౌశల్ పేరు మారుమ్రోగిపోయింది , కానీ ఇంతా పేరు సంపాదించుకున్న కౌశల్ అ తరవాత సినిమాలు ఎందుకు చేయడం లేదు అన్న విమర్శలు వచ్చాయి. వీటికి దీటుగా సమాధానం ఇస్తూ నాకు సినిమాల కంటే నా భార్య నాకు ముఖ్యం ఆమె ఆరోగ్యం ముఖ్యం .. నా సినిమాల కోసం ఎదురుచూసే ఫాన్స్ కి ఇదే నా సమాధానం అని చెప్పుకొచ్చాడు . ఇది ఇలా ఉంటే ఫాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పాడు కౌశల్ త్వరలోనే 'కుమారి 21F' ఫేం హెబ్బా పటేల్ను డైరెక్ట్ చేయబోతున్నట్లు తన అధికార ఇన్స్టాగ్రామ్ ద్వారా ఈ విషయాన్నీ వెల్లడించాడు. ఇద్దరూ దిగిన పిక్ను అందులో షేర్ చేశాడు. అ ఫోటోను ట్యాగ్ చేస్తూ , 'టైటిల్స్ వస్తుంటాయి.. పోతుంటాయి నా మల్టీటాస్కింగ్ మాత్రం అలాగే ఉండిపోతుంది. శ్రీరామ్ గోల్డ్ లోన్ యాడ్ ఫిల్మ్ కోసం హెబ్బా పటేల్ను డైరెక్ట్ చేస్తున్నా' అని రాసుకొచ్చాడు.
Instagramలోని ఈ పోస్ట్ని వీక్షించండిన kaushal manda (@kaushalmanda) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది