హిందీ సీరియల్స్ నటి సిమ్రాన్ ఖన్నా తన భర్త నుంచి విడాకులు తీసుకుంది. స్టార్ప్లస్ ఛానెల్లో సూపర్హిట్ అయిన 'Yeh Rishta Kya Kehlata Hai' (యే రిష్తా క్యా కెహ్లాతా హై) సీరియల్లో గాయత్రి గోయెంకా పాత్ర పోషించిన నటి సిమ్రాన్ ఖన్నా భర్త భరత్ నుంచి విడాకులు తీసుకుంది. ఈ మేరకు ఆమె అధికారికంగా దృవీకరించారు. స్నేహపూర్వకంగానే విడిపోతున్నామని, ఇద్దరి మధ్యా ఎలాంటి శత్రుత్వం లేదని చెప్పారు. తన కుమారుడు వినీత్ కస్టడీ మాత్రం భర్తకే ఇచ్చినట్లు తెలిపిన సిమ్రాన్ తరుచుగా కొడుకుని మాత్రం కలుస్తాను అని చెప్పింది.