ముచ్చటగా మూడోసారి...

Update: 2019-09-25 10:25 GMT

దర్శకుడు సంపత్ నంది దర్శకత్వంలో గోపీచంద్ 28 వ సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా తమన్నా నటిస్తుందని గత కొద్దిరోజుల నుండి వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలను చెక్ పెడుతూ సినిమాలో హీరోయిన్ గా తమన్నాని కన్ఫర్మ్ చేసారు. టీం యూనిట్ ఆమెకి సెట్లోకి స్వాగతం పలుకుతున్నట్లు ఓ ట్వీట్ చేసారు. గతంలో సంపత్ నంది దర్శకత్వంలో తమన్నా రచ్చ ,బెంగాల్ టైగర్ సినిమాల్లో నటించింది. ఇది మూడో సినిమా. ఇక గోపీచంద్ తో సంపత్ నందికి ఇది రెండో సినిమా కావడం విశేషం. ప్రస్తుతం గోపీచంద్ చాణిక్య అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా తర్వాత సంపత్ నంది సినిమా మొదలు కానుంది. 




 


Tags:    

Similar News