మెగాస్టార్ డ్రీం ప్రాజెక్ట్ గా సైరా ఈ బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి స్వతంత్ర సమర యోధుడు ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. భారీ బడ్జెట్ తో రామ్ చరణ్ ఈ సినిమాని నిర్మించగా సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. జగపతిబాబు,అమితాబ్ బచ్చన్, కిచ్చా సుదీప్, తమన్నా, విజయసేతుపతి ప్రధాన పాత్రల్లో కనిపించారు.
సినిమా విడుదలైన మొదటి షో నుండే సినిమాకి మంచి రెస్పాన్స్ వస్తుంది. కేవలం ప్రేక్షకులు మాత్రమే కాదు. సినిమా సెలబ్రెటీల నుండి కూడా మంచి టాక్ వస్తుంది. సినిమా బాగుందని, చిరంజీవి నటన అద్భుతమని కొనియాడుతున్నారు. ఇక సైరా కలెక్షన్ల పరంగా దూసుకుపోతుంది. ఏకాంగా సినిమాకి వంద కోట్లు వచ్చాయని తెలుస్తుంది. నైజాంలో తొలి మూడు రోజుల్లో ఈ సినిమా రూ. 14.62 కోట్లు రాబట్టిందని ట్రేడ్ అనలిస్ట్ రమేశ్ బాలా ఈ విషయాన్ని ట్వీట్ చేస్తూ.. నైజాంలో మూడురోజుల కలెక్షన్ వివరాలు (తొలిరోజు రూ. 8.10 కోట్లు, రెండోరోజు రూ. 3.98 కోట్లు, మూడో రోజు రూ. 2.54 కోట్లు) ట్విటర్లో వెల్లడించారు. ఇక ఓవర్సీస్ మార్కెట్లోనూ సైరా సత్తా చాటుతోంది. మూడు రోజుల్లో అమెరికాలో ఈ సినిమా రూ. 1.5 మిలియన్ డాలర్లు (రూ. 10.62 కోట్లు) రాబట్టిందని మరో ట్వీట్లో వెల్లడించారు.