నేటినుండి అమెజాన్ ప్రైమ్ లో సైరా
ఎంతో ప్రతిష్టాత్మకంగా సైరా సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు హీరో రామ్ చరణ్.. ఇందులో చిరుతో పాటు
రేనాటి వీరుడి కథగా సైరా సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ రెండున విడుదలైన ఈ సినిమా ప్రేక్షక ఆదరణ పొంది, మంచి విజయాన్ని అందుకుంది. తాజాగా ఈ చిత్రం 30 సెంటర్లలో 50 రోజులు పూర్తి చేసుకుంది. అయితే ఈరోజు (నవంబర్ 21 )నుండి ఈ సినిమాని హెచ్డీ ప్రింట్ తో ఆన్లైన్ లో చూడవచ్చునని అమెజాన్ ప్రైమ్ వీడియో ప్రకటించింది. ఈ సినిమాని తమిళ్, తెలుగు, కన్నడ, మళయాళం భాషలలో ఆన్లైన్లో చూడవచ్చు. హిందీలో త్వరలో విడుదల చేయనున్నారు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా సైరా సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించారు హీరో రామ్ చరణ్.. ఇందులో చిరుతో పాటు అమితాబ్ బచ్చన్, తమన్నా, నయనతార, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు, నిహారిక ముఖ్యపాత్రల్లో నటించి మెప్పించారు. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు.