యాబై రోజులు పూర్తి చేసుకున్న సైరా..
ఈ సినిమా 30 సెంటర్లలో యాబై రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
చిరంజీవి 151 వ చిత్రంగా సైరా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవిత కథ ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. అక్టోబర్ రెండున ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రామ్ చరణ్ ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మించగా, సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. ఈ సినిమా 30 సెంటర్లలో యాబై రోజులు పూర్తి చేసుకుంది. తాజాగా దీనికి సంబంధించిన ఫోటోను చిత్ర యూనిట్ విడుదల చేసింది.
రేనాటి వీరుడుగా సైరా నరసింహ రెడ్డి పాత్రలో చిరంజీవి చాలా అద్భుతంగా నటించారు. తన నటనతో ఆ పాత్రకి చిరంజీవి ప్రాణం పోశారనే చెప్పాలి. దానికి తోడు మిగతా పాత్రలలో అమితాబ్, విజయ్ సేతుపతి, సుదీప్, జగపతి బాబు,రవికిషన్,తమన్నా,అనుష్క, నయనతార చాలా చక్కగా సరిపోయారు. ఇక రత్నవేలు సినిమాటోగ్రఫీ, గ్రాండ్ విజువల్స్, సినిమాకి ప్రధాన ఆకర్షణగా నిలిచాయి.
ప్రస్తుతం చిరంజీవి కొరటాల శివ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా త్వరలో పట్టాలేక్కనుంది. వచ్చే ఏడాది సమ్మర్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది.