సినిమాటోగ్రాఫర్ శ్యామ్ కె. నాయుడు, అతడి స్నేహితుల నుంచి తనకు ప్రాణహాని ఉందంటూ హైదరాబాద్ ఎస్సార్నగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు నటి శ్రీసుధ. పెళ్లి చేసుకుంటానని నమ్మించి, ఐదేళ్లు కలిసున్న తర్వాత ఇప్పుడు కాదంటున్నాడంటూ గతేడాది శ్రీసుధ ఎస్సార్నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇప్పుడీ కేసును వెనక్కి తీసుకోవాలని బెదిరిస్తున్నారంటూ మరోమారు ఎస్సార్ నగర్ పోలీసులను ఆమె ఆశ్రయించారు. గతంలో ఆయనపై తాను పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలంటూ ఒత్తిడి తెస్తున్నారని, రాజీ కుదుర్చుకోవాలని బెదిరిస్తున్నారని ఆమె కంప్లయింట్ ఇచ్చారు. దీంతో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఎస్సార్ నగర్ పోలీసులు కేసును మాదాపూర్ పీఎస్కు బదిలీ చేశారు.