నటి అమలాపాల్ ఇటీవల తన ప్రియుడు, పంజాబీ గాయకుడు భవ్నీందర్ సింగ్ ను రెండో పెళ్లి చేసుకున్నట్టుగా ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీనిపై అమలాపాల్ వివరణ ఇస్తూ, తానేమీ పెళ్లి చేసుకోలేదని, అవి ఫొటో షూట్ కోసం దిగినవని చెప్పింది. తాజాగా అమలాపాల్ రెండవ పెళ్లిపై సంచలన నటి శ్రీరెడ్డి స్పందించింది.
భయపడొద్దు అమలాపాల్.. అంటూ సోషల్ మీడియా పోస్ట్ చేశారు. ఈ మేరకు ''బాధపడకు అమలాపాల్.. నీ పంజాబీ భర్త బాగానే చూసుకుంటాడు. నాకు పంజాబీలపై నమ్మకం ఉంది.'' అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా శ్రీరెడ్డి చేసిన వ్యాఖ్యలపై అమలాపాల్ అభిమానులు మండిపడుతున్నారు. ప్రస్తుతం కరోనా మహమ్మారీ నేపథ్యంలో ప్రజలు భయాందోళన చెందుతున్న సమయంలో శ్రీరెడ్డి ఇలాంటి పోస్టులు చేయడం అవసరమా అంటూ విమర్శిస్తున్నారు.