నేను యువతకి చెప్పేది ఒక్కటే : శ్రీముఖి

Update: 2019-10-25 12:39 GMT

అక్కినేని నాగార్జున హోస్ట్ గా వ్యవహరిస్తున్న బిగ్ బాస్ థర్డ్ సీజన్ చివరి దశకి చేరిపోయింది. మొత్తం 17 మందితో మొదలైన ఈ సీజన్ లో ఇప్పుడు ఆరుగురు మాత్రమే మిగిలారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో కొంచెం భాగోద్వేగానికి గురైంది శ్రీముఖి.. ఎప్పుడు నవ్వుతూ కనిపించే శ్రీముఖి తన జీవితంలో జరిగిన ఓ సంఘటనని టాస్క్ లో భాగంగా చెబుతూ భాగోద్వేగానికి లోనైంది..

ఇప్పటివరకు నా వ్యక్తిగత విషయాలను ఎవరికీ చెప్పలేదు. కానీ నేను ఒక అబ్బాయిని ప్రేమించాను. అతడికి కూడా నేనంటే చాలా ఇష్టం. ఈ విషయం పెద్దల వరకు వెళ్ళింది. వారు కూడా ఒప్పుకున్నారు. కానీ నేను ఓ కామెడి షో చేస్తుంటే నాకు బ్రేకప్ గురించి మెసేజ్ వచ్చింది. అప్పుడు చాలా ఏడ్చాను. కానీ నవ్వుతూనే ఆ షోని కంప్లీట్ చేశాను. ఆ తర్వాత చాలా రోజులు ఏడ్చాను. ఒకానొక దశలో చనిపోదాం అనుకున్నాను.

కానీ దాని గురించి ఇప్పుడు ఆలోచిస్తే మాత్రం ఎందుకు అంతలా భాదపడ్డాను అని అనిపిస్తుంది. నేను యువతకి చెప్పేది ఒకటే.. అమ్మనాన్నల తర్వాతే ఏదైనా .. జీవితంలో సెట్ అయ్యాకే ప్రేమ గురించి ఆలోచించండి. అంటూ చెప్పుకొచ్చింది శ్రీముఖి.. 

Tags:    

Similar News