రాజకీయాలు..సినిమాలు మధ్యలో జనసేనాని పవన్ ప్రత్యేక విమానం!

రాజకీయాల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటు రాజకీయాల్లో ఉంటూనే మరోపక్కా తన రీఎంట్రీని సిద్దం చేశారు.

Update: 2020-01-24 09:37 GMT

రాజకీయాల్లో ప్రస్తుతం ఫుల్ బిజీగా ఉన్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ఇటు రాజకీయాల్లో ఉంటూనే మరోపక్కా తన రీఎంట్రీని సిద్దం చేశారు.. బాలీవుడ్ లో మంచి హిట్ అయిన పింక్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నాడు పవన్.. ఈ సినిమాని బోని కపూర్, దిల్ రాజు కలిసి నిర్మిస్తున్నారు. వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమాకి లాయర్ సాబ్ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు.ఈ సినిమాలో పవన్ సరసన అంజలి, నివేదా థామస్ , అనన్య పాండే నటిస్తున్నారు. తాజాగా సినిమా షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో చాలా సైలెంట్ గా మొదలైంది. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

ఇక ఇది ఇలా ఉంటే పవన్ కోసం నిర్మాత దిల్ రాజు ప్రత్యేక విమానం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ప్రస్తుతం అమరావతి నుంచి రాజధాని మార్పుపైన పవన్ పోరాటం చేస్తున సంగతి తెలిసిందే.. తన రాజకీయ పనులకి ఇబ్బంది కలుగకుండా, అదేవిధంగా షూటింగులో కూడా పవన్ పాల్గొనేలా ప్లాన్ చేసుకుంటున్నారట. . అమరావతి టు హైదరాబాద్ వచ్చి వెళ్ళడానికి ఎక్కువ సమయం పడుతుందని భావించి.. నిర్మాత దిల్ రాజు పవన్ కోసం ఓ ప్రత్యేక విమానాన్ని కూడా ఏర్పాటు చేశారట. ఇప్పటికే ఓ విమాన సంస్థతో ఒప్పందం కూడా కుదిరిందని, దీనికి గాను కోటి రూపాయలవరకు ఖర్చు అవుతుందని సమాచారం. కానీ దీనిపైన ఎలాంటి అధికార ప్రకటన లేదు.

ఇక ఈ సినిమా కోసం పవన్ కేవలం 20 రోజుల డేట్స్ మాత్రమే ఇచ్చారని, అంతేకాకుండా ఈ సినిమా కోసం భారీ పారితోషికం తీసుకుంటున్నారని సమాచారం. ఈ సినిమాని త్వరగా కంప్లీట్ చేసి సమ్మర్ లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమాపైన భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఇక ఈ సినిమా తర్వాత పవన్ క్రిష్, పూరి జగన్నాధ్ దర్శకత్వంలో కూడా సినిమాలు చేసేందుకు ప్లాన్ చేసారని తెలుస్తోంది. దీనిపైన త్వరలో అధికార ప్రకటన వెలువడాల్సి ఉంది.

Tags:    

Similar News