జాతిపీత మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా అక్టోబర్ 29వ తేదీన భారత ప్రధాని మోడీ ఢిల్లీలోని తన నివాసంలో సినీ ప్రముఖులుతో కలిసి ఓ సమావేశాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.. అయితే ఈ సమావేశానికి బాలీవుడ్ హీరోలు చాలా మంది హాజరయ్యారు. ఇక దక్షిణాది నుండి కొంతమంది సినీ ప్రముఖులు మాత్రమే హాజరయ్యారు. దీనితో దక్షిణాది సినీ పరిశ్రమ నుంచి తీవ్ర నిరసన ఎదురైంది. ముఖ్యంగా హీరో రామ్ చరణ్ సతిమణి నేరుగా మోడికే ట్వీట్ చేసింది. అయితే దక్షిణాది నుండి ఈ కార్యక్రమానికి హాజరైన వారిలో ఒకరు ప్రముఖ నేపధ్య గాయకుడూ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ..
అయితే ఈ కార్యక్రమం గురించి అయన అసంతృప్తి వ్యక్తం చేసారు. "అక్టోబర్ 29 న ప్రధాని తన ఇంటి వద్ద ఏర్పాటు చేసిన సమావేశానికి నేను కూడా హాజరయ్యాను. అక్కడ మా సెల్ఫోన్లను భద్రత సిబ్బంది తీసుకొని మాకు టోకెన్లు ఇచ్చారు. కానీ లోపలికి వెళ్లి చూస్తే అక్కడ చాలా మంది స్టార్స్ మోడీతో కలిసి సెల్ఫీలు తీసుకుంటున్నారు. ఈ సంఘటనని చూసి నేను అసంతృప్తి చెందానని ఎస్పీ బాలు "తన సోషల్ మీడియా ఖాతాలో వివరించారు.