ప్రముఖ గాయని లతా మంగేష్కర్ అస్వస్థతకు గురయ్యారు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండడంతో ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్చారు.. వైద్యుల పర్యవేక్షణలో ఆమె చికిత్స పొందుతున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని తెలుస్తుంది. మరికాసేపట్లో అధికార ప్రకటన వెలువడుతుంది. 90 సంవత్సరాలు ఉన్న లతా మంగేష్కర్ దాదాపుగా 25 వేలకు పైగా సోలో సాంగ్స్ పాడి గిన్నిస్ బుక్ లోకి ఎక్కారు. ప్రస్తుత ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా ఆమె పాటలు పాడడం ఆపేసింది. భారత ప్రభుత్వం లతా మంగేష్కర్ ను పద్మభూషణ్, దాదా సాహెబ్ ఫాల్కే, భారతరత్న, పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.