వకీల్ సాబ్ సినిమాలో నటించడంపై క్లారిటీ ఇచ్చిన శృతిహసన్

రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు.

Update: 2020-04-10 16:50 GMT
Shruti hasan(file photo)

రాజకీయాలతో రెండేళ్ళు బిజీగా ఉన్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు వరుసపెట్టి సినిమాలు చేస్తున్నారు. అందులో భాగంగా అయన రీఎంట్రీ మూవీగా వకీల్ సాబ్ తెరకెక్కుతుంది. ఇది పవన్ కి 26 వ చిత్రం కావడం విశేషం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ క‌పూర్‌, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు.. కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా షూటింగ్ ప్రస్తుతానికి వాయిదా పడింది.

అయితే ఈ సినిమాలో పవన్ సరనస నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది గత కొద్దిరోజులుగా స‌స్పెన్స్ నెల‌కొంది. అందులో ప్రముఖంగా పలువురు పేర్లు వినిపించాయి. కానీ ఇందులో శృతిహసన్ ఫైనల్ అయినట్టుగా వార్తలు వచ్చాయి. అయితే తాజాగా ఈ న్యూస్ పైన శృతిహసన్ స్పందించింది. " వకీల్ సాబ్ సినిమాలో నేను చేయడం లేదు. ఈ సినిమాలో నేను పవన్ కి భార్యగా నటిస్తున్నట్టు జరుగుతున్న ప్రచారంలో ఎంతమాత్రం నిజం లేదు. త్వరలో నేను షూటింగులో పాల్గొననున్నట్టు చెప్పుకుంటున్నారు .. అదంతా కేవలం పుకార్లు" మాత్రమే అని వెల్లడించింది.

ఇక వకీల్ సాబ్ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.

Tags:    

Similar News