సస్పెన్స్కి పులిస్టాప్ : పవన్ కి జోడిగా శృతిహాసన్ ఫైనల్
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్.. ఇది పవన్ కి 26 వ చిత్రం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న తాజా చిత్రం వకీల్ సాబ్.. ఇది పవన్ కి 26 వ చిత్రం.. హిందీలో వచ్చిన పింక్ సినిమాకి ఇది రీమేక్ ..ఇందులో అంజలి, నివేతా థామస్, అనన్య పాండే హీరోయిన్స్ గా నటిస్తున్నారు.ఈ సినిమాకి ఓ మై ఫ్రెండ్ ఫేం వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా, బోనీ కపూర్, దిల్ రాజుకలిసి సంయుక్తంగా సినిమాని నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నాడు..ప్రస్తుతం శేరవేగంగా జరుపుకుంటున్న ఈ సినిమాని మే 15న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు..
అయితే ఈ సినిమాలో పవన్ సరనస నటించబోయే హీరోయిన్ ఎవరు అన్నది గత కొద్దిరోజులుగా సస్పెన్స్ నెలకొంది. అందులో ప్రముఖంగా పూజా హెగ్డే, లావణ్య త్రిపాఠి, ఇలియానా, శృతి హాసన్ పేర్లు వినిపించాయి. కానీ దీనిపైన చిత్ర యూనిట్ స్పందించింది లేదు. అయితే ఈ సస్పెన్స్కి శృతి హాసన్ పులిస్టాప్ పెట్టిందని అంటున్నారు. పవన్ సరసన మూడో సారి తాను నటించబోతున్నట్టు పేర్కొంది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్, శృతిహాసన్ కలిసి గబ్బర్ సింగ్, కాటమరాయుడు సినిమాలలో కలిసి నటించారు. సినిమాలో శ్రుతి ఫైనల్ కావడంతో గత కొద్దిరోజులుగా నడుస్తున్న సస్పెన్స్కి పులిస్టాప్ పెట్టినట్టు అయింది.
ఇక వకీల్ సాబ్ సినిమా తరవాత పవన్ వరుసపెట్టి సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యారు. ఇప్పటికే క్రిష్ డైరెక్షన్లో ఓ సినిమాని పవన్ లైన్ లో పెట్టారు. ప్రస్తుతం ఈ సినిమా కూడా శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. ఎఎం రత్నం ఈ సినిమాని భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. ఇక దీని తర్వాత పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. ఇక పూరి, త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమాలు చేసేందుకు పవన్ సిద్దం అయ్యారని తెలుస్తోంది.