వంద కోట్ల క్లబ్ లో మహేష్ 'సరిలేరు నీకెవ్వరు'
సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు...
సంక్రాంతి కానుకగా జనవరి 11న రిలీజ్ అయిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు చిత్రం సరిలేరు నీకెవ్వరు... విడుదలైన మొదటి షో నుంచే సినిమాకి మంచి టాక్ వచ్చింది. దీనితో బాక్సాఫీస్ వద్ద సినిమా దూసుకుపోతుంది. కేవలం మూడు రోజులలోనే వందకోట్ల మార్క్ను అందుకుంది. ఈ విషయాన్నీ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. దీనికి సంబంధించిన ఓ పోస్టర్ ని కూడా రిలీజ్ చేసింది. ఈ సినిమా తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా రూ.46.77 కోట్ల షేర్ సాధించగా, రెండోరోజు రూ.32.77 కోట్ల షేర్, ఇక మూడో రోజు 20 కోట్ల షేర్ వరకు రాబట్టిందని చెబుతున్నారు. మూడు రోజులలోనే సినిమా వంద కోట్ల క్లబ్ లో చేరడం పట్ల చిత్ర బృందం ఆనందం వ్యక్తం చేస్తుంది.
భరత్ అను నేను, మహర్షి చిత్రాల తర్వాత మహేష్ బాబు నటించిన చిత్రం కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఈ సినిమాని అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ మూవీగా తెరక్కించాడు. ఈ సినిమాలో మహేష్ సరసన రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించింది. మొదటిసారిగా మహేష్ ఆర్మీ లుక్ లో కనిపించారు. విజయశాంతి కీలకపాత్రలో మెరిసింది. రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్ ,రావు రమేష్, సంగీత, బండ్ల గణేష్ ముఖ్యపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు.
ఇక ఈ సినిమా తర్వాత మహేష్ బాబు వంశీపైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమాని చేస్తున్నారు. ఇప్పటికే సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ లు అయిపోయాయి.. గతంలో వీరి కాంబినేషన్లో మహర్షి అనే సినిమా వచ్చి మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ సినిమాని కూడా శ్రీ వెంకటేశ్వర సంస్థ అధినత దిల్ రాజు నిర్మించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.
There you go! Blockbuster Ka Baap... #SarileruNeekevvaru REAL 103+ Crores Gross in 3 days 💥
— AK Entertainments (@AKentsOfficial) January 14, 2020
Super ⭐ @urstrulyMahesh @AnilRavipudi @vijayashanthi_m @iamRashmika @ThisIsDSP @AnilSunkara1 @AKentsOfficial @GMBents @SVC_official#SuperStarSankranthi#BlockBusterKaBAAP #MASSMB 🔥 pic.twitter.com/FIzT4ifUul