దొరసాని రెండో చిత్రం మొదలైంది
దొరసాని సినిమాతో వెండితెరకి పరిచయం అయింది హీరో రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక.. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి.
దొరసాని సినిమాతో వెండితెరకి పరిచయం అయింది హీరో రాజశేఖర్, జీవితల రెండో కుమార్తె శివాత్మిక.. ఈ సినిమాలో ఆమె నటనకి మంచి మార్కులు పడ్డాయి. మొదటి సినిమాతోనే మంచి నటి అని గుర్తింపు తెచ్చుకున్న శివాత్మికకి మంచి ఆఫర్స్ వచ్చాయి. కానీ కథల ఎంపికలో జాగ్రత్తలు వ్యవహరిస్తూ వచ్చిన శివాత్మిక ఓ కొత్త చిత్రం చేయడానికి సిద్దం అయింది.
దుర్గా నరేష్ గుట్టా దర్శకత్వంలో తెరకెక్కుతున్న ' విధి విలాసం' సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది శివాత్మిక. ఇందులో 24 కిస్సేస్ ఫేం అరుణ్ అదిత్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమా ఈరోజు( సోమవారం ) లాంఛనంగా ప్రారంభమైంది. ఫిల్మ్ నగర్లోని దైవ సన్నిధానంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి సినిమాను ప్రారంభించారు. హీరోహీరోయిన్లపై షూట్ చేసిన తొలి సన్నివేశానికి దర్శకుడు ప్రవీణ్ సత్తారు క్లాప్ కొట్టారు. మరో డైరెక్టర్ హరీష్ శంకర్ కెమెరా స్విచ్ ఆన్ చేశారు. తొలి సన్నివేశానికి డైరెక్టర్ దశరథ్ గౌరవ దర్శకత్వం వహించారు. జీవితా రాజశేఖర్ చిత్ర యూనిట్కు స్క్రిప్ట్ను అందజేశారు.
ఈ సినిమాని ఎస్.కె.ఎస్ క్రియేషన్స్ బ్యానర్పై శివ దినేష్ రాహుల్, అయ్యర్ నకరకంటి నిర్మిస్తున్నారు. ఇంద్రజ, కోట శ్రీనివాసరావు, పోసాని కృష్ణమురళీ, సత్య, అజయ్ ఘోష్, అజయ్, జయప్రకాష్ తదితరులు ముఖ్యపాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది.
ఇక శివాత్మిక ఈ సినిమాతో పాటు క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రంగామార్తండ సినిమాలో కీలక పాత్రలో నటిస్తుంది. మరాటి భాషలో మంచి హిట్టు అయిన నటసామ్రాట్ సినిమాని తెలుగులో రీమేక్ చేస్తున్నారు. ప్రకాష్ రాజ్ మెయిన్ లీడ్ లో నటిస్తుండగా, రమ్యకృష్ణ, బ్రహ్మానందం, రాహుల్ సింప్లీగంజ్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. సినిమాపైన మంచి అంచనాలు ఉన్నాయి.
Well it's movie No.3!!! I feel honoured and truly blessed! #VidhiVilasam with dear dear @AdithOfficial and our lovely director Naresh garu✨ aanndd a big thanks to our producer Rahul garu🙌🏽 pic.twitter.com/iYOKZd0qKY
— Shivathmika Rajashekar (@ShivathmikaR) January 20, 2020