శ్రీవారి సేవలో సరిలేరు నీకెవ్వరూ మూవీ టీమ్

Update: 2020-01-17 04:16 GMT
శ్రీవారి సేవలో సరిలేరు నీకెవ్వరూ మూవీ టీమ్

సరిలేరు నీకెవ్వరూ మూవీ టీమ్.. తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. నిన్న రాత్రే తిరుమల చేరుకున్న మూవీ యూనిట్‌ సభ్యులు ఇవాళ ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. హీరో మహేశ్ బాబు, ఆయన భార్య నమ్రతా శిరోద్కర్, కూతురు, కుమారుడితో పాటు సీనియర్ నటులు విజయశాంతి, రాజేంద్రప్రసాద్‌, దర్శకులు అనిల్ రావిపూడి, వంశీ పైడిపల్లి, మెహర్‌ రమేశ్, నిర్మాత దిల్ రాజు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు.

సరిలేరు నీకెవ్వరు మూవీ సక్సెస్ కావడంతో స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా రంగనాయకుల మండపంలో చిత్ర బృందానికి వేదపండితులు ఆశీర్వచనం చేయగా అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపలకు వచ్చిన మహేష్ బాబును చూసేందుకు, ఆయనతో సెల్ఫీ తీసుకునేందుకు అభిమానులు పోటీ పడ్డారు.

 

Delete Edit

 

Tags:    

Similar News